ఆహార భద్రత ఎన్టీఆర్ ఆలోచనే
posted on Aug 27, 2013 9:15PM
యుపిఏ ప్రభుత్వం, సోనిమా గాందీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భద్రత బిల్లు పై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి హరికృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కేంద్ర స్ధాయిలో ఆహార భద్రత గురించి ప్రస్ధావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 2 రూపాయలకే కిలోబియ్యం ఇచ్చిపేదవాడి ఆఖలి తీర్చిన ఘనత అన్న ఎన్టీఆర్దే అన్నారు.
తాను తెలుగుదేశం పార్టీ విడుతున్నట్టుగా వచ్చిన వార్తలను కూడా హరికృష్ణ ఖండిచారు. తనుకు అలాంటి ఆలోచనే లేదని, ఇది తన తండ్రి స్ధాపించిన పార్టీ అని ఆ పార్టీ భవిష్యత్తు కోసం శ్రమిస్తానన్నారు. తను పార్టీ వీడుతున్నట్టుగా మాట్లాడుతున్న వారివి చిల్లర మాటలన్న ఆయన అలాంటి వాళ్ల మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.