అద్దెకు వచ్చి ఇళ్ళు నాదంటే ఎట్లా?
posted on Sep 27, 2013 7:17PM
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఎంపి లగడపాటి రాజగోపాల్లది ఒకే స్కూలులా ఉందని, ఇల్లు అద్దె కోసం వచ్చి ఇల్లు నాదే అన్న చందంగా అశోక్ బాబు మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. కేంద్రం రోడ్ మ్యాప్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర ఆలోచన పక్కన పెట్టి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించుకోవాలో ఆలోచించుకోవాలని సూచించారు.
తెలంగాణ డిమాండ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విత్తనం వేస్తే, చంద్రబాబు నాయుడు దానికి నీళ్లు పోశారని అన్నారు.ముఖ్యమంత్రిని చూసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో రివర్స్ అయ్యారు. బెయిలు మీద జెయిలు నుండి వచ్చిన జగన్ కు అట్టహాసంగా స్వాగతం పలకడం సిగ్గు చేటు అని వి.హనుమంతరావు విమర్శించారు.