గవర్నర్ నరసింహన్ ను మార్చే యోచనే లేదు

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మారుస్తున్నారని.. ఆ స్థానంలో సుష్మా స్వరాజ్ ను నియమిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని, ఇప్పట్లో నరసింహన్ ను మార్చే యోచన కేంద్రానికి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

అదేవిధంగా పలువురు నాయకులు బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్నా వార్తలపై కూడా జీవీఎల్  స్పందించారు. తమ పార్టీలో చేరే వారిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవా భావంతో పార్టీలోకి వస్తానంటే వారిని తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పార్టీలో అంతర్గత చర్చ జరిగిన తర్వాతే ఆయా పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటామని జీవీఎల్ వివరించారు.