గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మాణాల కూల్చివేత

 

హైదరాబాద్‌ నగరంలోని  గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సోమవారం నుంచి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టిన ఇళ్ళను కూల్చివేస్తు్న్నారు. మంగళవారం నాడు కూల్చివేతలు జరుగుతూ వుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న ఇళ్ళ యజమానులతోపాటు స్థానిక శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరికెపూడి గాంధీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల విషయంలో టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, అధికారులు టీఆర్ఎస్ నేతల ఇళ్లను మాత్రం వదిలి మిగతా వారి ఇళ్ళను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. గురుకుల్ ట్రస్ట్ భూములను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు.