మార్పుతప్పదంటున్న గులాంనబీ ఆజాద్
Published on: Fri Aug 31, 2012 11:03AM
రాష్ట్రప్రభుత్వంలో, టిటిడిలో భారీ మార్పులుంటాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఎప్పుడూ మాట దాటేసే ఆజాద్ ఈసారి మాత్రం తన మనసులోని మాటను బైటపెట్టారు. రాష్ట్రంలో భారీ ప్రక్షాళన తప్పదని, అయితే అది ప్రభుత్వంలోనా లేక పార్టీకి మాత్రమే పరిమితమౌతుందా అన్న విషయాన్ని మాత్రం ఆజాద్ బైట పెట్టలేదు. డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆజాద్ ని కలిసిన కాసేపటికే ఆయన ఇలాంటి కీలకమైన విషయాలు చెప్పడంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నాయకత్వం మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో రాజనర్సింహ ఢిల్లీ పెద్దల్నిపదేపదే కలుస్తుండడంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.


