పారిపోయిన వరుడు.. ప్రాణం తీసుకోబోయిన వధువు...

 

రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల రూపాయల కట్నం, మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు. దాంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తట్టుకోలేక వధువు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దాంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.