అంధ బాలలను చావబాదిన ‘అంధుడు’

 

కాకినాడలోని గ్రీన్ ఫీల్డ్స్ అంధుల పాఠశాలకు కరస్పాండెంట్‌గా ఒక అంధుడైన కేవీ రావు వున్నాడు. సోమవారం నాడు సదరు కరెస్పాండెంట్ స్కూల్‌లో చదివే పిల్లలను అంధుడు కాని ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో దారుణంగా చావబాదాడు. తాను స్వయంగా అంధుడు అయినప్పటికీ అంధ బాలలను దారుణంగా కొట్టడం కెమెరా కంటికి దొరికిపోయింది. అల్లరి చేశారన్న నెపంతో ముగ్గురు అంధ బాలలను బెత్తంతో చావబాదాడు. తనకు కనిపించదు కాబట్టి పిల్లలను ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో ఒళ్ళు వాచిపోయేలా చావబాదాడు. ఈ అంశం మీద డీఈవో, మండల విద్యాశాఖాధికారి స్పందించారు. కరస్పాండెంటుపై అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని తెలిపారు. బాలల హక్కుల కమిషన్కు చెందిన అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. పిల్లలను చావబాదిన కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.