చంద్రబాబుకు గవర్నర్ ఫోన్

కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నెల 20 న చేపట్టిన దీక్ష ఆరో రోజుకి చేరింది.. ఆరోగ్యం క్షీణించినా దీక్ష ఆపేదిలేదని సీఎం రమేష్ ఇప్పటికే తేల్చి చెప్పారు.. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ ఆందోళన చెంది సీఎం చంద్రబాబుకి ఫోన్ చేశారట.. 'సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకున్నాను.. వారిద్దరినీ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని' గవర్నర్ బాబుని కోరినట్టు తెలుస్తుంది.. దీనిపై స్పందించిన బాబు, కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రం నుండి స్పష్టమైన హామీ వచ్చేలా చూడాలన్నారట.