గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు
Published on: Mon Jul 14, 2025 2:37PM

గోవా గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హరియాణా గవర్నర్గా ఆషిమ్ కుమార్ ఘోష్, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికైన ఆయన 1982లో టీడీపీ చేశారు. వరుసగా 1983, 1985, 1994, 1999, 2009 అసెంబ్లీ ఎన్నికలలో శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. అశోక్ గజపతిరాజు 2014-19 వరుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పని చేశారు


