ఏపీలో ఐదు యూనివర్సిటీలకు వీసీల నియామకం
Published on: Wed Oct 8, 2025 9:23PM

ఏపీలో ఐదు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకటసత్యనారాయణరాజు సమంతపుడి, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా తాతా నర్సింగరావు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా బి.జయరామిరెడ్డి, జేఎన్టీయూ (విజయనగరం) వీసీగా వి.వెంకటసుబ్బారావు, యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) వీసీగా రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు.


