ఏపీ ప్రజలరా బీహార్ గ్యాంగులు దిగాయి..జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్‌లో వరుస దొంగతనాలు..దారి దోపిడీలు పెరిగిపోయాయి..తాజాగా విజయవాడ బీసెంట్‌రోడ్‌లో బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి దుండగులు ప్రవేశించి అక్కడి సిబ్బందిని బెదిరించి సుమారు 7 కేజీల బంగారాన్ని దోపిడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది..రాష్ట్రంలోకి నాలుగు బీహార్ గ్యాంగులు ప్రవేశించాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమల్లో ఈ గ్యాంగులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఈ గ్యాంగులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని..త్వరలోనే వీరి ఆట కట్టిస్తామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.