ద్వివేదికి కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!!

 

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం ద్వివేదినీ బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కె. విజయానంద్ ను నియమించింది. 

కాగా, తాజాగా ద్వివేదికి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. ద్వివేదినీ ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.