విద్యార్థినిపై పోలీస్ అత్యాచారం...

 

కంచే చేను మేసింది. విద్యార్థులను దుష్ట శక్తుల నుంచి కాపాడాల్సిన ఓ పోలీసు తానే దుష్టుడైపోయి ఒక విద్యార్థినిని మానభంగం చేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తనపై ఓ కానిస్టేబుల్ రెండు నెలల క్రితం అత్యాచారం చేశాడంటూ ఆ విద్యార్థిని (21) పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో గిరిరాజ్ సింగ్ (23) అనే ఆ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ పోలీసు కానిస్టేబుల్ తనతో స్నేహం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, రెండు నెలల క్రితం అదే ప్రాంతంలోని ఓ హోటల్లో తనపై అతడు అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.