జీహెచ్ఎంసీ ఎన్నికల తుది ఫలితాలు

జీహెచ్ఎంసీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల నడుమ పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. గత ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిపొందిన టీఆర్ఎస్.. ఈసారి 55 డివిజన్లలో గెలుపొందింది. గత ఎన్నికల్లో నాలుగు డివిజన్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 48 డివిజన్లలో గెలిపొంది సత్తా చాటింది. ఇక, ఎంఐఎం 44 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైంది. టీడీపీ ఖాతా తెరవలేకపోయింది.