‘గీతాంజలి’ దర్శకుడు సేఫ్!!

 

అంజలి హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి’ సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా డైరెక్టర్‌ రాజ్‌ కిరణ్‌ ఛాతీనొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో ఉదయం చేర్చారు. కిరణ్‌కు ఛాతినొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. గీతాంజలి సినిమా విడుదల సన్నాహాలు చేస్తూ రాజ్ కిరణ్ ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం అర్థరాత్రి 1 గంట వరకు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తన ఇంటికి వెళ్లారని, మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గుండెపోటు అనుకుని హుటాహుటిన మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో చేర్చారు.