గీతారెడ్డి గెలుపు..మెదక్ లో విజయశాంతి ఓటమి

 

 

 

మెదక్ జిల్లాలో పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు, తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కన్న నాయకురాళ్ళు గీతారెడ్డి, విజయశాంతి. వీరిలో గీతారెడ్డి ఓటమి వరకు వెళ్ళి తప్పించుకుని, గెలిచారు. విజయశాంతి మాత్రం మొదటి నుంచీ వెనుకగులోనే వుండి చివరికి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన రాములమ్మకు భారీ షాక్ తగిలింది. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ పార్టీకి జంప్ అయిన విజయశాంతి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జె.గీతారెడ్డి ఓటమిని తృటిలో తప్పించున్నారు.