మైనర్‌ యువతికి గంజాయి తాగించి అత్యాచారం చేశారు


అదో గంజాయి ముఠా.. అందులో 15 మంది అబ్బాయిలతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓ మైనర్‌ అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేస్తూ... శరీరంపై బ్లేడుతో గాట్లు పెట్టిన దారుణమైన సంఘటన ఇటీవల హైదరాబాదులో వెలుగు చూసిన విషయం మీకు తెలిసిందే. మైనర్‌ యువతిపై అత్యాచారం, గంజాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దోమలగూడకు చెందిన 15 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. గ్యాంగ్‌లో నాను అలియాస్ నరేష్‌, నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్‌లు కీలకమైన వ్యక్తులు. ఆ యువకులు గ్యాంగ్‌లోని ఇద్దరు అమ్మాయిలకు గంజాయి అలవాటు చేశారు. గంజాయి అమ్మాయిలకు తాగించి వారిపై గతంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ‌వీడియోలు తీసీ బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి.ఈ ముఠాలో నాను అలియాస్ నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ ముఠా అమ్మాయిలకు గంజాయి అలవాటు చేస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వీడియోలు తీస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ వీడియోలను చూపిస్తూ అమ్మాయిలను బెదిరించడం కూడా అలవాటు చేసుకున్నారు. గతంలో నాను, అభిరామ్‌లు కలిసి గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరికి కానిస్టేబుల్ వేషం వేయించారు. తరవాత గంజాయి సప్లై చేసిన అలీని బెదిరించి రూ.18 వేలు తీసుకున్నారు‌. అలీ నారాయణ గూడ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు పెట్టాడు. ఆ తర్వాత సుదర్శన్‌ అతడి మిత్రుడైన కార్పోరేటర్ సహాయంతో కేసు మాఫీ చేయించాడు.