గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే అరెస్ట్

గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జయిని నగరంలోని మహంకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు వికాస్ దూబే రావడంతో అక్కడి గార్డు అతన్ని పట్టుకొని.. ఉజ్జయిని జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో‌ తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి వికాస్‌ దూబే పారిపోయిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా 40మంది ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలించినా అతడు దొరకలేదు. గత వారం రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వికాస్ దూబే.. ఎట్టకేలకు గురువారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పోలీసులకు పట్టుబడ్డాడు.