గణేష్ నిమజ్జనానికి వరుణుడి అడ్డు!

 

గణేశ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి ముస్తాబయ్యాయి. కానీ ఈ ఏడాది గణేష్ నిమజ్జనంకు భారీ వర్షం అడ్డుపడటంతో, వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌తో పాటు, 21 చెరువులలోనూ గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 71 భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు రక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలు మోహరించారు.