గల్లా జయదేవ్ అనే నేను..!!

టీడీపీ, మోడీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభమైంది.. ఈ సందర్బంగా చర్చ ప్రారంభించిన గల్లా జయదేవ్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు.. ఇచ్చిన ప్రమాణాన్ని నిలుపుకోవాలని, అలా నిలుపుకోక పోతే మనిషే కాదని ఆ సినిమాలో ఉన్న డైలాగ్‌ను గల్లా ఆంగ్లంలో అనువదించి సభలో ప్రస్తావించారు.

 

 

ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ప్రమాణాలను కేంద్రం నిలుపుకోలేదని గల్లా చెప్పారు.. విభజన తరువాత కొత్త రాష్ట్రం ఏపీనే అన్న గల్లా.. ఆస్తులు తెలంగాణకు అప్పులు ఏపీకి ఇచ్చారు అన్నారు.. రాజధాని లేదు, ఆదాయం లోటులో ఉంది, ఏపీ అనిశ్చితిలో ఉంది.. అనిశ్చితి నుండి బయట వేయమని కేంద్రాన్ని కోరుతున్నాం అన్నారు.. ఏపీ మీద చూపుతున్న వివక్ష చూస్తుంటే, మేం భారతదేశంలో భాగం కాదా అనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసారు.