మళ్లీ రాజకీయాల్లోకి గాలి... రీ ఎంట్రీకి ప్లాన్...

 

గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీరాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి.. తన కూతురి పెళ్లి అనంతరం రాజకీయ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈనేపథ్యంలోనే ఆయన ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీ పార్టీలో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత.. 2011లో గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై అరెస్ట్ అయి, ఆపై షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన, రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే మళ్లీ బీజేపీలోకే వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం. పైగా కేంద్రంలో కూడా ఆ పార్టీయే అధికారంలోకి ఉండటంతో గాలి బీజేపీలోకే చేరే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి గాలి ఎంట్రీకి బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.