TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

Published on: Mon May 11, 2026 6:57PM

 

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్‌లో ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది.

సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతలకు అవకాశం కల్పించింది. అదేవిధంగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాలను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించింది.