గాలికి అమిత్ షా షాక్.... పార్టీతో ఆయనకు సంబంధం లేదు....

 

త్వరలో కర్ణాటక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం కావడంతో ఎన్నికల్లో గెలవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే.. ఈ ఎన్నికల్లో అక్రమ మైనింగ్ కేసులో రెండున్నర ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్దమయ్యారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాలికి షాకిచ్చారు. ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. దీంతో అమిత్ షా ప్రకటన విన్న గాలి ఖంగుతిన్నారు. ఇక గాలి అనుచరులకు అమిత్ ప్రకటన చూసి మింగుడు పడటం లేదట. పార్టీ అధ్యక్షుడి నుంచే ఇలాంటి ప్రకటన రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. మరి చూద్దాం ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో....