తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స

తెలంగాణలో కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో క‌రోనా టెస్ట్‌లు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యిం తీసుకుంది. ఇందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మొద‌ట మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఈ సేవ‌ల‌ను మ‌రిన్ని ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.