TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటాలో నలుగురు  నామినేషన్లు 

Published on: Mon Mar 10, 2025 3:19PM

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.  కాంగ్రెస్ నుంచి   విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. విజయశాంతి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అనూహ్యంగా ఎంఎల్ సి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కాదని విజయశాంతికి పదవి రావడంలో తెలంగాణ ఇన్ చార్జి జయంతి నటరాజన్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కాంగ్రెస్ కు  వచ్చే నాలుగు సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్  ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు సీట్ల సర్దుబాటు చేసుకుంది. తమకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సీపీఐ గట్టిగా పట్టుబట్టింది కొత్తగూడెం మాత్రమే  కాంగ్రెస్ కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది.