మిస్సైల్ మ్యాన్కు ఆటోవాలా నివాళులు..
posted on Jul 28, 2016 10:05AM
శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు నిరుపమానమైనవి. కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అని చెప్పి యువతలో స్పూర్తి నింపిన మార్గదర్శి కలాం. ఆయన మన నుంచి దూరమై అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న దేశం మొత్తం కలాంకు నివాళులు ఆర్పించింది. అయితే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు, చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్. తేనాంపేటకు చెందిన కలయరసన్ కలాం వర్థంతి సందర్భంగా ప్రయాణికులకు ఉచిత సేవలందించాడు. నిన్న ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు అడయార్, కోడంబాక్కం, కెకె.నగర్ తదితర ప్రాంతాల్లో ఉచితంగా విద్యార్థులను, మహిళలను గమ్యస్థానాలకు చేర్చడం లాంటివి చేసి ఇదే తాను ఆ మహనీయునికి ఇచ్చే నివాళిగా పేర్కొన్నాడు.