లోక్‌సభ మాజీ స్పీకర్‌ ఛటర్జీ కన్నుమూత

 

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) కన్నుమూశారు.. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఛటర్జీ ఈనెల 7 నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా నిన్న ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది.. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు.. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.. 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు.. అలాగే సీపీఎం పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు.. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.