జనసేనకు గట్టి దెబ్బ.. బీజేపీలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ!!

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్న లక్ష్మీనారాయణ పార్టీ మారుతారంటా కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా బీజేపీ కీలక నేతలలో ఆయన మంతనాలు సాగించినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ బీజేపీలో చేరటం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ తో పాటుగా జనసేన మరో కీలక నేత కూడా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి పోటీ చేసిన గంపల గిరిధర్ సైతం పార్టీ వీడి..లక్ష్మీనారాయణ తో పాటుగా బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ రోజు లేదా రేపు దీని పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.