శ్రీశైలం ఆలయంలో నాణ్యత తనిఖీలు!
Published on: Fri Oct 4, 2024 1:10PM

శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రసాదాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు షేక్ ఖాశీంవలి, ఓవీ రాముడు గురువారం లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న పదార్ధాలు, ఆలయానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను వారు పరిశీలించారు. అలానే లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు అందిస్తున్న లడ్డులను పరిశీలించారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, ప్రసాదాల్లో ఉపయోగించే వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.


