30 మంది అమ్మాయిలకు అస్వస్థత

 

కలుషితమైన ఆహార పదార్థాలు తినడంతో 30 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థినులు మంగళవారం రాత్రి హాస్టల్‌లో వండిన కలుషిత పదార్ధాలు తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో అస్వస్థతకి గురైన 30 మంది విద్యార్థినులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ గురుకుల విద్యాయం విద్యార్థినులు హాస్టల్‌లో ఆహారం ఎంతమాత్రం బాగా వుండటం లేదని గత రెండు రోజులుగా ఆందోళనకు దిగారు. అయితే మంగళవారం రాత్రి కూడా నాణ్యత లేని భోజనం చేయడం వల్ల వీరు అస్వస్థతకి గురైనట్టు తెలుస్తోంది.