ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షం

 

ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడి మీద సాయంత్రం అయిదు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్ వినాయకుడి మీద హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయకచవితి రోజున ఖైరతాబాద్ గణపతికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా ఈసారి మాత్రమే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, వచ్చే ఏడాది నుంచి వరుసగా ఎత్తు తగ్గుతూ వస్తుండటంతో ఈసారి పూలవర్షం కురిపించాలని ఉత్సవ కమిటీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే.