గణేశ నిమజ్జనం.. అపశ్రుతులు... ఐదు ప్రాణాలు..

 

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయకచవితి వేడుకల చివరి రోజైన నిమజ్జనం రోజున మాత్రం కొంతమంది మరణించడం అనేది ప్రతి ఏడాదీ జరుగుతోంది. ఈ మరణాలను ఆపాలని ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా ప్రయోజనం వుండటం లేదు. ఈ ఏడాది వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు యువకులు మరణించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మానేరు వాగులో వినాయక నిమజ్జనం సందర్భంగా నగురం గ్రామానికి చెందిన సంజీవరావు, శ్రావణ్ కుమార్, రవి అనే ముగ్గురు యువకులు నీట మునిగి మరణించారు. అలాగే మెదక్‌లో శివకుమార్ అనే యువకుడు వినాయక నిమజ్జనం చేస్తూ నీటిలో పడి చనిపోయాడు. ఉప్పల్‌కి చెందిన రామరాజు నాగర్జున సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్ళి అక్కడ డ్యాం పక్కనే వున్న నీటి ప్రవాహంలో పడి మరణించాడు.