ఒకే కుటుంబంలోని ఐదుగురి ఆత్మహత్య

 

అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గుంతకల్లులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం వుండే ఐదుగురు వ్యక్తులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. రైల్వేలో పనిచేసే శ్రీనివాసులు తన కుమార్తె, అల్లుడితో కలసి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం వుంటున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాసులు, ఆయన కుమారుడు క్రాంతికుమార్ ఇంట్లోంచి బయటకి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి హత్య చేసి, ఈ ముగ్గురూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.