TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాబ్ కింగ్స్ కు తొలి ఓటమి

Published on: Wed Apr 29, 2026 8:09AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. మంగళవారం ((ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో ఆరువికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. మార్కస్ స్టయినిస్ మెరుపు ఇన్నింగ్స్ 22 బంతుల్లో 66 నాటౌట్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ మన్ సింగ్ 44 బంతుల్లో 59 అర్ధశతకంతో రాణించాడు. 
అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్  27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.

చాహల్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. ఒక దశలో విజయయానికి 50 బంతుల్లో వంద పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే.. ఫెరీరా, శివం దుబెలు నిలకడగా, వేగంగా ఆడారు. పేసర్లను లక్ష్యం చేసుకుని బౌండరీల వర్షం కురిపించారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.