వైసీపీ ఎన్నికల ప్రచారం.. 29 పూరిళ్లు దగ్ధం

 

విజయనగరం జిల్లా  డెంకాడ మండలం పోతయ్యపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహానికి 29 పూరిళ్లు దగ్థమయ్యాయి. నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ప్రచారం చేస్తుండగా కొందరు కార్యకర్తలు బానసంచా కాల్చారు. ఈ ఘటనలో నిప్పు రవ్వలు పూరిళ్లపై పడ్డాయి. శరవేగంగా మంటలు వ్యాపించడంతో 29 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లల్లోని ధాన్యం, వంట సామాగ్రి, నగదు, బంగారు వంటి వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే అప్పటికే పూర్తిగా నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.