తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon May 1, 2023 8:41AM
వేసవి సెలవులకు తోడు కార్యాలయాలకూ వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో వరుసగా మూడో రోజూ భక్తుల రద్వీ కొనసాగుతోంది.
ఆదివారం మొత్తం 82వేల 582 మంది భక్తులు తిరుమల సందర్శించారు. హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చింది.
కంపార్ట్ మెంట్లు దాటి భక్తులు క్యూలైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి చేస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


