బలవంతంగా బాబు దీక్ష భగ్నం

 

Fasting Chandrababu Naidu, Chandrababu, tdp, delhi, telangana

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష భగ్నమైంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రి వైద్యులు బలవంతంగా ఫ్ల్యూయిడ్స్ ఎక్కించి బాబు దీక్షను భగ్నం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు వారికి న్యాయం చేయాలంటూ గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించింది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినప్పటికీ బాబు ఒప్పుకోలేదు. దీంతో నిన్న(శుక్రవారం) పోలీసులు ఆయనను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. అయినా బాబు ఆస్పత్రిలో దీక్షను కొనసాగించారు. ఈ ఉదయం బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆరోగ్యం క్షీణించడంతో మూడు గంటల ప్రాంతంలో ఫ్ల్యూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు