జగన్ ఇంటి ముందు రైతుల ఆందోళన

 

వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి లోటస్ పాండ్ ఇంటిముందు రైతులు భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేస్తున్నారు. వీరంతా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన రైతులు. జగన్‌కి చెందిన ఇండస్ట్రీస్‌కి గురజాల నియోజవర్గంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన దాదాపు 613 ఎకరాల భూములను వినియోగంలోకి తేనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీజును రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు ఈ భూములు వినియోగంలోకి రాకపోవడంతో భూముల మొదటి సొంతదారులైన రైతులు ఈ పొలాల్లో పండించిన పంటలను సరస్వతి ఇండస్ట్రీస్‌కి చెందిన వారు ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేశారు. అప్పుడు రైతులు అడ్డుకోవడంతో వారిని గాయపరిచారు. ఆ సంఘటనలో గాయపడిన రైతులను తీసుకుని గురజాల ప్రాంతానికి చెందిన రైతులందరూ జగన్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు.