రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రుణాల రీషెడ్యూల్ కు అంగీకరిస్తూ రిజర్వ్ బ్యాంకు రెండు ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలను పంపింది.మూడేళ్ళ వరకు రుణాల రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంకు తన అంగీకారాన్ని తెలిపింది. ఎంతమందికి రీషెడ్యూల్ చేస్తారో, వాటి విధివిధానాలపై ఓ నివేదిక పంపాలని ఇరు ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది. రీషెడ్యూల్ చేసిన రుణాలను రైతులు మూడేళ్లలో తిరిగి చెల్లించగలరా? అని ఆర్‌బీఐ ఈ సందర్భంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రుణ మాఫీ ఎలా మారుతుందన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కోటయ్య కమిటీ తన అద్యయనం ప్రకారం ఎవరికి ఈ పధకం వర్తింప చేయాలన్నది కూడా సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంకు లేఖపై అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై ఆర్బీఐ చివరిలో ఏదైనా తిరకాసు పెడితే, అప్పుడు ఆ కొత్త ప్లాన్‌ను అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతున్నారని తెలుస్తోంది.