సెటిల్‌మెంట్ల మాస్టర్ ఎల్లంగౌడ్

 

నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ కొద్ది రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. సదరు ఎల్లంగౌడ్‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి ఎల్లంగౌడ్ లీలలను వివరించారు. లొంగిపోయిన ఎల్లంగౌడ్ దగ్గర్నుంచి పోలీసులు 65 వేల రూపాయల దొంగనోట్లు, ఆమధ్య కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఎల్లంగౌడ్‌ మీద తెలంగాణలో 15 కేసులు, కర్నాటకలో మూడు కేసులు వున్నాయి. కొద్ది రోజుల క్రితం చైన్ స్నాచర్ శివను పోలీసులు కాల్చి చంపారు. తనకు కూడా పోలీసులు అలాంటి తగే పట్టిస్తారని భయపడిన ఎల్లంగౌడ్ ఓ రాజకీయ నాయకుడి సహకారంతో పోలీసులకు లొంగిపోయాడు. ఎల్లంగౌడ్ దొంగనోట్ల చెలామణి మాత్రమే కాకుండా సెటిల్‌మెంట్లు చేయడంలో కూడా ముదిరిపోయాడు... ఇలా పోలీసులు ఎల్లంగౌడ్ లీలలను వివరించారు. ఎల్లంగౌడ్ ముఠాని ప్రాణాలకు తెగించి ముఠాను పట్టుకునేందుకు యత్నించిన ఎస్ఐ వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు.