కరీంనగర్‌లో బాంబు బెదిరింపు కలకలం...

 

తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్లో సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. పట్టణంలోని విద్యాధరి స్కూల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి స్కూలుకు ఫోన్ చేశాడు. దాంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని, ఫోన్ ఆకతాయిల పని అని తేలడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ మీద  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.