లెంపలేసుకున్న ఫేస్ బుక్.. పొరపాటున జరిగింది..

 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అప్పుడప్పుడు కొన్ని అకౌంట్లను డిజేబుల్ చేస్తుంటుంది. ఏదైనా అనైతిక చర్యలకు పాల్పడినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఇందుకు కాను ఫేస్ బుక్ లెంపలేసుకోవాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. పాలస్తీనాకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఇతరుల అకౌంట్లను ఫేస్ బుక్ డిజేబుల్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన పాలస్తీనా జర్నలిస్టులు తమ అకౌంట్లను డిలీట్ చేయడంతో ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ప్రచారం మొదలుపెట్టారు. ప్రతివారం తమ బృందం లక్షల కొద్దీ రిపోర్టులను ప్రతివారం ప్రాసెస్ చేస్తుందని, కొన్నిసార్లు పొరపాటు జరుగుతుందని.. ఈ తప్పునకు మాత్రం తాము చాలా బాధపడుతున్నామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి అల్ అరబియా ఇంగ్లీష్ చానల్‌కు తెలిపారు. అసలు ఫేస్‌బుక్‌లో ఎవరూ ఏమీ పోస్ట్ చేయొద్దని కోరారు. ప్రభుత్వాలకు, ఫేస్‌బుక్ యంత్రాంగానికి మధ్య ఎలాంటి  ఒప్పందాలున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక దిగొచ్చిన ఫేస్ బుక్ జరిగిన తప్పిదానిని లెంపలేసుకుంది. పొరపాటున ఆ పేజీలను తీసేశారని.. తమకు ఆ విషయం తెలియగానే వెంటనే వాటిని పునరుద్ధరించామని తెలిపింది.