మైలార్ దేవ్ పల్లి దేవాలయం ఆవరణలో పేలుడు
Published on: Tue Nov 19, 2024 3:56PM
హైద్రాబాద్ మైలాదేవ్ పల్లి లక్షి గూడెలో ఓ దేవాలయ ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆలయ పూజారీకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పూజారీని ఆస్పత్రి తరలించారు. సంఘటనా స్థలికి క్లూస్ టీం చేరుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని వ్యర్థాలను అక్కడ పడేయటంతో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. లక్షిగూడెం వద్ద ఉన్న ఆలయపరిసరాలను పూజారీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


