మన్మోహన్ కే కోపం తెప్పించిన మోడీ..

 

ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి కూడా కోపం వచ్చింది. మరి మన్మోహన్ సింగ్ కు అంతలా కోపం తెప్పించింది ఎవరబ్బా అని అనుకుంటున్నారా...? అది ఎవరో కాదు... ప్రస్తుత ప్రధాని మోడీ. ఇంతకీ ఏ విషయంలో మన్మోహన్ సింగ్ కు కోపం వచ్చిందంటే.. పాకిస్థాన్ తో అంట‌కాగుతున్నార‌నే అర్ధం వ‌చ్చేలా మోడీ... త‌న‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ ఓ లేఖ విడుద‌ల చేశారు. రాజ‌కీయ ల‌బ్దికోసం మోడీ ఇలాంటి అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ఆరోప‌ణ‌లు త‌న‌ను చాలా బాధించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.  మోడీ ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ చెప్పి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య హుందాత‌నాన్ని కాపాడాల‌ని కోరారు

 

కాగా గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మోడీ... గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ కు పాక్ సాయం చేస్తోంద‌ని మోడీ ఆరోపించారు. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఇంట్లో ఇందుకోసం ఓ భేటీ జ‌రిగింద‌ని, పాక్ మాజీ అధికారులు, నేత‌లతో పాటు..భార‌త మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కూడా ఈ భేటీలో పాల్గొన్నార‌ని, ఇది అనేక సందేహాల‌ను క‌లిగిస్తోంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎప్పుడూ మౌనమునిలా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా కోపం వచ్చిందంటే పాపం బాగానే ఫీల్ అయినట్టు ఉన్నారు.