తెరాస కు మరో షాక్.. బీజేపీ లోకి మరో ముఖ్య నేత

 

 

గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘన  విజయం సాధించిన తెరాస మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న విధంగా సీట్లు సాధించలేక పోయింది. తాజాగా 2023 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జెండా  ఎగర వేయాలని చూస్తున్న బీజేపీ కూడా టీఆరెస్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కేంద్రం లో అధికారంలో ఉంటూ, ప్రతిపక్షాలు అధికారం లో ఉన్న ఒక్కొక్క రాష్ట్రం లో అధికారం హస్తగతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర  పార్టీలలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. టీఆరెస్ నేత సోమారపు సత్యనారాయణను చేర్చుకున్న బీజేపీ, తాజాగా మరో సీనియర్ టీఆరెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కూడా టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. టీఆరెస్ లో కనీసం గౌరవం కూడా దక్కని పరిస్థితులలో అయన పార్టీని వీడి బీజేపీ లో చేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.