మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్‌ లో తనకు పాజిటివ్‌గా తేలిందని.. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన.. కరోనా వచ్చిందని భయపడవద్దని అన్నారు. అది రాకూడని రోగం కాదని, ప్రమాదకారి కాదని చెప్పారు. అయితే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా సోకకుండా అందరూ కనీస జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు. ఇతరులతో కారులో ప్రయాణం చేయొద్దని  సూచించారు. భయపడి టెస్టులు చేయించుకోవడం మానొద్దని మాణిక్యాలరావు పేర్కొన్నారు.