వలంటీరు వేధింపులు భరించలేక.. మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వివరిస్తూ బంధువులకు నాయుడు ఆడియో మెసేజ్ పంపాడు. వలంటీర్‌ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. నాయుడి మృతితో.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.