రామోజీరావు కుమారుడు ఈ టీవీ సుమన్ కన్నుమూత
Published on: Fri Sep 7, 2012 11:07AM
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రెండో కుమారుడు సుమన్ గురువారం అర్థరాత్రి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుమన్ హైద్రాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుమన్ వయస్సు 45 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సుమన్ ఉషోదయా ఎంటర్ప్రైజ్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ టీవీలో ప్రసారమైన కొన్ని సీరియల్స్కు రచయితగా కూడా పనిచేశారు. సుమన్ అంత్యక్రియలు శుక్రవారం రోజు రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతాయి. సుమన్ మృతి పట్ల సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, హరికృష్ణ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


