లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలి.. ఎర్రబెల్లి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలని కోరారు. టీడీపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీని జాతీయ పార్టీగా మహానాడులో ప్రకటిస్తామని తెలిపారు. అంతే కాక ఏపీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తోందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. లక్ష రూపాయలు మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఇక ఎండతీవ్రతకు వడదెబ్బ తగిలి చనిపోతున్న వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని అన్నారు.