మొదలైన కౌటింగ్.. అక్కడ బీజేపీ, ఇక్కడ వైసీపీ జోరు

 

ఎన్నికల కౌటింగ్ మొదలైంది. ఊహించని అద్భుతాలు ఏమి జరగట్లేదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే.. కేంద్రంలో ఎన్డీయే కూటమి, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి.
ప్రస్తుతమున్న ఆధిక్యాలను పరిశీలిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 208, యూపీఏ కూటమి 87, ఇతరులు 63 ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 20, టీడీపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది,
ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే టీఆర్ఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.